రంకెలేసిన.. కోడె గిత్తలు.. కుర్రాళ్లలో ఉరకలేసిన ఉత్సాహం.. వెరసి జల్లికట్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ నూతిగుంట పల్లిలో ఆదివారం జరిగిన పశువుల పరసకు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమం ఆద్యంతం రంకెలేసిన కోడె గిత్తలతో, అంతే ఉత్సాహంతో యువకులు సందడి చేశారు. అక్కడి చేరుకున్న మోహిత్ రెడ్డికి పలువురు జేజేలు పలికారు.
జల్లికట్టు వీక్షణకై వచ్చిన జనం నిండు మనస్సుతో ఆశీర్వదించారు.